శవ రాజకీయాలు చేస్తున్నారు.. మండిపడ్డ చినరాజప్ప

Published : Feb 20, 2019, 11:21 AM IST
శవ రాజకీయాలు చేస్తున్నారు.. మండిపడ్డ చినరాజప్ప

సారాంశం

వైసీపీ, బీజేపీలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఏపీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు.

వైసీపీ, బీజేపీలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఏపీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు. ఇటీవల కోటయ్య అనే రైతు మృతి చెందగా.. వైసీపీ, బీజేపీలు ప్రభుత్వంపై ఆరోపణలు  చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై చినరాజప్ప స్పందించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని చెప్పారు. రైతు కోటయ్య ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటి పోలీసులపై వారే చంపారని నిందలు వేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. 

టికెట్లు రానివారే పార్టీ వీడుతున్నారని ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చకున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి స్థానంలో మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

వైసీపీకి సన్స్ స్ట్రోక్...కొడుకులు ఏం చేసినా సమర్థించుకుంటారా? | Jogi Ramesh Family Controversy
AP Minister: వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావు.. డీఎస్సీ వివాదంపై ఏపీ మంత్రి పవర్ ఫుల్ వార్నింగ్