గరికపాటికి ఊరట... జగన్‌కు షాక్: మైనింగ్ భూముల లీజును కొట్టేసిన ఏపీ హైకోర్టు

Siva Kodati |  
Published : Sep 02, 2020, 08:16 PM IST
గరికపాటికి ఊరట... జగన్‌కు షాక్: మైనింగ్ భూముల లీజును కొట్టేసిన ఏపీ హైకోర్టు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మైనింగ్ భూముల లీజును రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మైనింగ్ భూముల లీజును రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

బల్లికురవలో బీజేపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు ఇచ్చిన మైనింగ్ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం మూడు నోటీసులు ఇచ్చింది. వీటిని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

పర్యావరణ అనుమతులు లేవని, మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని లీజు రద్దు చేసిన జగన్ సర్కార్ రూ.217 కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై గరికపాటి రామ్మోహన్ రావు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. లీజు రద్దు, జరిమానా నోటీసుల్ని సస్పెండ్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు
CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu