ఆ విలీనాలపై స్టే: జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో షాక్

Siva Kodati |  
Published : Oct 22, 2020, 06:07 PM IST
ఆ విలీనాలపై స్టే: జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో షాక్

సారాంశం

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని రెండు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని రెండు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది.

గణపవరం, పసుమర్రు గ్రామాలను చిలకలూరిపేటలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ  రవితేజ, పూర్ణచంద్రరావు అనే ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గణపవరం, పసుమర్రును నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై గురువారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సర్కార్ ఆదేశాలపై స్టే విధించింది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Visits Juvvaladinne: జువ్వలదిన్నె పర్యటనలో జగన్ కోసం ఫ్యాన్స్ పరుగులు| Asianet News Telugu
YS Jagan Visits Juvvaladinne: మత్స్య కారుల సమస్యలు విని జగన్ రియాక్షన్ చూడండి| Asianet News Telugu