కోర్టు ధిక్కరణ కేసులో ఎమ్మార్వోకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

Published : Feb 19, 2022, 05:17 PM IST
కోర్టు ధిక్కరణ కేసులో ఎమ్మార్వోకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andra Pradesh High Court) ఓ తహసీల్దార్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష విధించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andra Pradesh High Court) ఓ తహసీల్దార్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మండలంలోని కొత్తకోటలో భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఎమ్మార్వో రైతు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆ రైతు హైకోర్టును ఆశ్రయించారు. 

దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు రైతు భూమిని మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మార్వో ఆ పని చేయలేదు. దీంతో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఎమ్మార్వోకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఈ తీర్పు వెలువరించింది. 

PREV
click me!

Recommended Stories

మాట్లాడుతూనే ఉంటా.. దేనికైనా రెడీ! | Professor Nageshwar Strong Reaction | Asianet News Telugu
చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ తెలుగు తమ్ముళ్లకు పూనకాలే | Mahanadu2026 | Asianet News Telugu