ఏమని పిలవాలి.. అందుకే లోకేష్‌ను డ్యా** అంటా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 19, 2022, 03:47 PM IST
ఏమని పిలవాలి.. అందుకే లోకేష్‌ను డ్యా** అంటా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

తనను ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అంటారని, టీడీపీ అధినేతను నారా చంద్రబాబు నాయుడు అంటారని... కానీ నారా లోకేశ్ ని ఏమనాలో తనకు తెలియడం లేదంటూ సెటైర్లు వేశారు. అందుకే లోకేశ్‌ను తాను ఒక డ్యాష్ అంటానని చెప్పారు. 

టీడీపీ (tdp) నేతలు నారా లోకేశ్ (nara lokesh), పట్టాభిలపై (kommareddy pattabhi) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (dwarampudi chandrasekhar reddy) మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అంటారని, టీడీపీ అధినేతను నారా చంద్రబాబు నాయుడు అంటారని... కానీ నారా లోకేశ్ ని ఏమనాలో తనకు తెలియడం లేదంటూ సెటైర్లు వేశారు. అందుకే లోకేశ్‌ను తాను ఒక డ్యాష్ అంటానని చెప్పారు. పట్టాభి అనే వ్యక్తి టీడీపీ తొత్తు అని, చంద్రబాబు వద్ద జీతానికి పని చేసే వ్యక్తి అని ద్వారంపూడి ఎద్దేవా చేశారు.

కాకినాడ నుంచి అక్రమంగా రైస్ ఎక్స్ పోర్ట్ అవుతోందని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని చంద్రబాబు, లోకేశ్‌లు వారి తొత్తులకు చెప్పాలని ఆయన హితవు పలికారు. లేనిపోని ప్రగల్భాలు మాట్లాడటం... తోక ఛానల్, తోక పత్రికలో వాటిని వేసుకోవడం చేస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. 

మరోవైపు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati goutam reddy) నేతృత్వంలో ఏపీ పరిశ్రమల శాఖ (ap industrial ministry) అధికారులతో కూడిన ఓ బృందం దుబాయ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వివిధ అంతర్జాతీయ కంపనీలు ఏపీలో పెట్టుబడులకు సిద్దంగా వున్నాయని మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నట్లు... ఇంకా పలు కంపనీలు ఏపీలో పెట్టబడులకు సిద్దంగా వున్నాయని మంత్రి మేకపాటి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సైటైర్లు వేసారు. 

''ఖాళీ కుర్చీలకి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు? పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మీ స్పీచ్ కే హైలెట్! చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపి పరువు గంగలో కలిసిపోయింది. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు'' అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు. 

ఇదిలావుంటే ఇప్పటికే లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకున్నట్లు మంత్రి మేకపాటి బృందం ప్రకటించింది. అలాగే రీజెన్సీ గ్రూప్ కూడా రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చి ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. "ఫ్లూయెంట్ గ్రిడ్" అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్  గ్రూప్ లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో కూడా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి మేకపాటి ప్రకటించారు.
 
తాజాగా అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ ప్రకటించింది.  వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్