కృష్ణా: మాజీ కలెక్టర్ ఇంతియాజ్, మరో అధికారికి వారెంట్లు.. హైకోర్టు ఆదేశాలు

Siva Kodati |  
Published : Jul 14, 2021, 07:03 PM IST
కృష్ణా: మాజీ కలెక్టర్ ఇంతియాజ్, మరో అధికారికి వారెంట్లు.. హైకోర్టు ఆదేశాలు

సారాంశం

కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కు హైకోర్టు షాకిచ్చింది. జగనన్న చేయూత పథకం అమలు చేయకపోవడంపై వీరిద్దరికి వారెంట్లు చేసింది.

కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కు హైకోర్టు వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేయాలని విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కృష్ణా జిల్లా నందిగామలో 20 మంది అర్హులకు.. జగనన్న చేయూత పథకం అమలు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రామ సభలో ఆమోదించిన తర్వాత కూడా పథకం అమలు చేయకుండా.. నిర్లక్ష్యం వహించారని న్యాయవాది ప్రభాకర్ పిటిషన్ వేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?