కోవిడ్ అలర్ట్.. ఏపీకి అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపండి : కేంద్రాన్ని కోరిన విడదల రజనీ

Siva Kodati |  
Published : Dec 23, 2022, 09:00 PM ISTUpdated : Dec 23, 2022, 09:03 PM IST
కోవిడ్ అలర్ట్.. ఏపీకి అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపండి : కేంద్రాన్ని కోరిన విడదల రజనీ

సారాంశం

దేశంలోని కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కట్టడిపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 

దేశంలో ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కూడా హాజరయ్యారు. ఏపీలో ప్రస్తుతం 47 వేల వ్యాక్సిన్‌లు అందుబాటులో వున్నాయని.. రెండు మూడు రోజుల్లో ఇవి నిండుకుంటాయని ఆమె తెలిపారు. ఏపీకి వ్యాక్సిన్లు పంపాలని... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కట్టడిపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు రజనీ వెల్లడించారు. 

బీఎఫ్.7 విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని కేంద్రం సూచించింది. పండగల సీజన్ కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. 

ALso Read: కరోనా అలర్ట్.. పండగ సీజన్‌లో జాగ్రత్త, రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కాగా... ఇత‌ర దేశాల్లో క‌రోనా వ్యాప్తికి అధికంగా కార‌ణ‌మ‌వుతున్న క‌రోనా వైర‌స్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూసిన త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడ మహమ్మారి ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించారు. ప్రస్తుత నిఘా చర్యలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో. కోవిడ్ -19 పరీక్ష, జన్యుక్రమాన్ని పెంచాలని, ముఖ్యంగా సెలవు సీజన్ సమీపిస్తున్నందున అన్ని సమయాల్లో కోవిడ్-తగిన ప్రవర్తనను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌కుండా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. 

ఇదిలావుండగా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవియా బుధవారం అధికారులు, ప్రజారోగ్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కొత్త కోవిడ్ -19 వేరియంట్లపై నిరంతరం నిఘా ఉంచిందనీ, విమానాశ్రయాలలో విదేశీ రాకలను కూడా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు కోవిడ్-19 కేసులు పెరిగితే తీసుకునే చ‌ర్య‌లకు స‌న్న‌ద్దం అవుతున్న‌ట్టు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu