సినిమా టికెట్ల ధరలు .. జీవో నెంబర్ 35 రద్దు: హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు జగన్ సర్కార్

Siva Kodati |  
Published : Dec 14, 2021, 09:31 PM IST
సినిమా టికెట్ల ధరలు .. జీవో నెంబర్ 35 రద్దు: హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు జగన్ సర్కార్

సారాంశం

సినిమా టికెట్ల తగ్గింపుకు సంబంధించి జారీ చేసిన జీవో నెం 35ని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. సామాన్య ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అప్పీల్‌కు వెళ్లనుంది ప్రభుత్వం. ఈ మేరకు డివిజన్ బెంచ్‌కు వెళ్లనుంది. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను AP High Court మంగళవారం నాడు రద్దు చేసింది. సినిమా టికెట్ల రేట్లను పెంచుకొనే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల AP Assembly సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను Online లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే Cinema Tickets  అమ్మాలని బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  టికెట్ ధరలు తగ్గింపుపై సినీ పరిశ్రమలో పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై  పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పారు. 

Also Read:జగన్ సర్కార్‌కి షాక్: జీవో నెంబర్ 35 రద్దు, పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు

ఏపీ సర్కార్ తీసుకొన్ని నిర్ణయం సినిమా నిర్మాతలపై తీవ్రంగా పడనుంది. సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏదైనా సినిమా విడుదలైతే వారం రోజుల్లోనే ఆ సినిమా టికెట్ ధరలను పెంచుకొనేందుకు అవకాశం లేకపోతే  నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు  Tollywood సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.Balakrishna నటించిన అఖండ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

అయితే సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 35 నెంబర్ జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కోన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu