జగన్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ- డీ కేటగిరీలోకి మున్నూరు కాపులు

Siva Kodati |  
Published : Aug 20, 2022, 09:23 PM IST
జగన్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ- డీ కేటగిరీలోకి మున్నూరు కాపులు

సారాంశం

మున్నూరు కాపులను బీసీ- డీ కేటగిరీలోకి చేరుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా వుంది. 

మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని బీసీలుగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు.. మున్నూరు కాపులను బీసీ- డీ కేటగిరీలోకి చేర్చుతున్నట్లు తెలిపింది. ఇకపై వీరికి బీసీ- డీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయనుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా వుంది. వీరిని కాపులుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు తమను బీసీలుగా గుర్తించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన.. అందుకు తగినట్లుగా ఆదేశాలు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Markapuram Accident:కదిలిస్తే కన్నీళ్లే.. మార్కాపురం బస్సుబాధితుల పరిస్థితిఇదీ | Asianet News Telugu
Markapuram Bus Accident Aftermath | Vehicles Removed Using Crane Accident Spot | Asianet News Telugu