స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.241 కోట్ల స్కామ్.. చంద్రబాబుదే బాధ్యత: చల్లా మధు

Siva Kodati |  
Published : Jul 13, 2021, 07:33 PM ISTUpdated : Jul 13, 2021, 07:35 PM IST
స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.241 కోట్ల స్కామ్.. చంద్రబాబుదే బాధ్యత: చల్లా మధు

సారాంశం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు తేలిందన్నారు చల్లా మధు. అది కేబినెట్ నిర్ణయం కనుక చంద్రబాబే బాధ్యత వహించాలని మధు డిమాండ్ చేస్తున్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తామంటూ గత ప్రభుత్వం సిమెన్స్ ప్రాజెక్ట్ చేపట్టింది. అయితే అందులో కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్థారణ అయ్యిందంటున్నారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చల్లా మధు. మొత్తం ప్రాజెక్ట్‌లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు బదిలీ చేసినట్లు తేలిందన్నారు. అది కేబినెట్ నిర్ణయం కనుక చంద్రబాబే బాధ్యత వహించాలని మధు డిమాండ్ చేస్తున్నారు. సీఐడీ విచారణలో అధికారులు, నాయకుల పేర్లు బయటకు వస్తాయని చల్లా మధు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu