
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం గ్రామ , వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు.. ఈ క్యాంపుల్లో అందించే సేవలకు ఎలాంటి రుసుములను వసూలు చేయబోమని పేర్కొంది.
అయితే, మ్యుటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్కు సంబంధించి పాస్ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ‘‘జగనన్నకు చెబుదాం’’కు అనుబంధంగా సమస్యల పరిష్కారానికి ఈ నాలుగు వారాల పాటు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 24 నుంచి ఈ కార్యక్రమంపై వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని ప్రభుత్వం చెప్పింది.
క్యాంపుల్లో అందించే సేవలు , జారీ చేసే సర్టిఫికెట్లు ఇవే :