తగ్గేదేలే... జీతాలు, పెన్షన్లను ప్రాసెస్ చేయండి: ట్రెజరీ శాఖకు ఏపీ సర్కార్ మరో ఆదేశం

Siva Kodati |  
Published : Jan 25, 2022, 07:16 PM IST
తగ్గేదేలే... జీతాలు, పెన్షన్లను ప్రాసెస్ చేయండి: ట్రెజరీ శాఖకు ఏపీ సర్కార్ మరో ఆదేశం

సారాంశం

జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని మరోసారి ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు డీడీవోలకు ఏపీ ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది.

జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని మరోసారి ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు డీడీవోలకు ఏపీ ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ కమిటీకి స్టీరింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలోనే ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. 

కాగా.. జనవరి 20వ తేదీన కూడా రాష్ట్రంలోని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలో  ఈ ఆదేశాలు వెలువడడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తమ అంగీకారం తెలపకపోతే ప్రభుత్వం పాత జీతాలనే చెల్లిస్తోందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త పీఆర్సీ ఆధారంగా  సవరించిన పే స్కేల్స్  తో Salaries చెల్లింపునకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో వైపున కొత్త జీతాల చెల్లింపునకు సంబంధించి ప్రత్యేక Software  ను సీఎఫ్ఎంఎస్ సిద్దం చేసింది. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా  ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరౌతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.తక్కువ  ఫిట్‌మెంట్ ఇచ్చినా పీఆర్సీ ఫిట్‌మెట్ కు అంగీకరించినా ప్రభుత్వం హెచ్ఆర్‌ఏ తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్