రాయలసీమ అభివృద్ధికి జగన్ కీలక నిర్ణయం..!

Published : Dec 15, 2020, 01:06 PM ISTUpdated : Dec 15, 2020, 01:27 PM IST
రాయలసీమ అభివృద్ధికి జగన్ కీలక నిర్ణయం..!

సారాంశం

ముద్దనూరు- కొడికొండ చెక్‌పోస్టు మార్గాన్ని జాతీయ రహదారి స్థాయిలో నిర్మించాలన్నారు. నాలుగు కీలక రహదారులను తొలిదశలో రూ.217 కోట్లతో అభివృద్ధి చేపట్టాలన్నారు. 

రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా)పై సమీక్షించారు. అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు.. కీలక సూచనలు చేశారు. పులివెందులలోని ఏపీ-కార్ల్‌ సంస్థలో ఈ నెల 24న గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌ ప్రాంతానికి చెందిన గ్రామీణ మేనేజ్‌మెంట్‌ సంస్థ (ఇర్మా)కు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

 అలాగే కడప విమానాశ్రయంలో రాత్రిపూట కూడా విమానాలు దిగేలా రన్‌వేను విస్తరించాలన్నారు. దీనికి సంబంధించి 47 ఎకరాలను సేకరించి విమానాశ్రయ సంస్థకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమీపంలోని బుగ్గవంకలో 7 కిమీ భద్రత గోడ నిర్మించగా, మిగిలిన 3 కిమీ నిర్మాణంతోపాటు రోడ్లు, మురుగు నీటి వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ముద్దనూరు- కొడికొండ చెక్‌పోస్టు మార్గాన్ని జాతీయ రహదారి స్థాయిలో నిర్మించాలన్నారు. నాలుగు కీలక రహదారులను తొలిదశలో రూ.217 కోట్లతో అభివృద్ధి చేపట్టాలన్నారు. గండి క్షేత్రం వీరాంజనేయస్వామి ఆలయంలో రూ.21 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎం సూచన చేశారు. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, సీటీ సెంటర్‌, నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని లేఅవుట్లలో మంచినీరు, మురుగునీటి పారుదల పనులు పూర్తి చేయాలని.. రింగ్‌రోడ్డును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు.

వేంపల్లిలో రూ.92 కోట్లతో భూగర్భ మురుగునీటి పనులను ఆమోదించారు. తొండూరులో బాలికల బీసీ గురుకుల పాఠశాల, పులివెందుల, వేంపల్లిలో రైతుబజార్లు, పులివెందులలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం, కడపలోని స్టేడియానికి ఫ్లడ్‌ లైటింగ్‌ వ్యవస్థ, కడప రైల్వేస్టేషన్‌, రిమ్స్‌ రోడ్ల అభివృద్ధి వెంటనే చేపట్టాలన్నారు సీఎం జగన్. ఈ పనుల్ని దశల వారీగా చేపట్టాలని సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu