విశాఖలో గ్యాస్ లీక్: కేజీహెచ్‌లో బాధితులకు జగన్ పరామర్శ

Published : May 07, 2020, 02:01 PM ISTUpdated : May 07, 2020, 04:56 PM IST
విశాఖలో గ్యాస్ లీక్: కేజీహెచ్‌లో బాధితులకు జగన్ పరామర్శ

సారాంశం

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో అస్వస్థతకు గురైన  బాధితులను సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు  మధ్యాహ్నం పరామర్శించారు.  

విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో అస్వస్థతకు గురైన  బాధితులను సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు  మధ్యాహ్నం పరామర్శించారు.

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గురువారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ లీకైన ఘటనలో 10 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

also read:నిర్లక్ష్యం లేదని కంపెనీ నిరూపించుకోవాలి: విశాఖ ప్రమాదంపై మంత్రి గౌతం రెడ్డి

ఈ విషయమై అమరావతిలో  అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశం తర్వాత జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖకు చేరుకొన్నారు. విశాఖలో కేజీహెచ్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  బాధితులను పరామర్శించారు.

ప్రమాదం జరిగిన తీరును ఆయన బాధితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి సీఎం ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం వైద్యులను వాకబు చేశారు.బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

TDP Net Worth : అమ్మో.. టీడీపీ అకౌంట్లో అన్ని వందల కోట్లా? చంద్రబాబు పార్టీ ఖర్చు, ఆదాయం లెక్కలు ఇవే..
వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu