తన తండ్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు.
పులివెందుల: తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్న ఆయనకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్న ఆయన బుధవారం ఉదయం తన తండ్రి సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబమంతా పాల్గొననున్నారు.
వీడియో