అమరావతిలో రథోత్సవం: రాజధాని ప్రజల ఆందోళన, రైతును ఢీకొన్న వైసీపీ ఎంపీ కారు

By Siva KodatiFirst Published Feb 23, 2020, 6:14 PM IST
Highlights

రాజధాని తరలింపు, మూడు రాజధానుల తరలింపు నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అమరేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

రాజధాని తరలింపు, మూడు రాజధానుల తరలింపు నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అమరేశ్వర స్వామి రథోత్సవం జరిగింది.

Also Read:రోజాకు అమరావతి సెగ: వాహనం ముందు బైఠాయించిన మహిళలు, రైతులు

ఈ కార్యక్రమానికి మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదే సమయంలో రాజధాని గ్రామాల రైతులు తరలివచ్చి జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. మంత్రి మోపిదేవి దగ్గరకు వెళ్లి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు.

Also Read:అచ్చెన్నాయుడు, గణేష్ లను టార్గెట్ చేసింది అందుకే..: వైసిపిపై చంద్రబాబు ఆగ్రహం

సరిగ్గా ఇదే సమయంలో నిరసన తెలుపుతున్న రైతుల వైపుగా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కారు వెళ్లింది. అక్కడే ఉన్న తుళ్లూరుకు చెందిన తాడికొండ హనుమంతరావు అనే రైతును ఎంపీ వాహనం ఢీకొట్టడంతో ఆయన కిండపడిపోయాడు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన రైతును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నందిగం సురేశ్ కారులోనే ఉన్నారు. 
 

click me!