ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త వర్సిటీలు, విద్యార్ధులకు లాప్‌టాప్‌లు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

Siva Kodati |  
Published : Jun 30, 2021, 02:19 PM ISTUpdated : Jun 30, 2021, 02:30 PM IST
ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త వర్సిటీలు, విద్యార్ధులకు లాప్‌టాప్‌లు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

సారాంశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.   

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:

  • మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదం
  • 28 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రచార కార్యక్రమం 
  • 9-12వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
  • ప్రకాశం జిల్లా పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఆమోదం
  • విజయనగరంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ వర్సిటీకి ఆమోదం
  • మౌలిక సదుపాయాల కల్పనకు రూ..5,990 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం 
  • 2021-24 ఐటీ విధానానికి ఆమోదం
  • ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఆమోదం
  • రీసర్వేలో పట్టాదారులకు ధృవపత్రాలు జారీ 
  • హంద్రీనివా సుజల స్రవంతి పథకంలో పుట్టపర్తి నియోజకవర్గానికి రూ.864 కోట్లతో నీటి సరఫరాకు కేబినెట్ ఆమోదం
  • విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్
  • సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు కేబినెట్ అంగీకారం
  • కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ
  • మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి
  • విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం
  • 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం 
  • రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
     

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu