సోము వీర్రాజు నేతృత్వంలో ఉత్తరాంధ్రలో బీజేపీ జల పోరు యాత్ర..

Published : Apr 02, 2022, 04:39 PM IST
సోము వీర్రాజు నేతృత్వంలో ఉత్తరాంధ్రలో బీజేపీ జల పోరు యాత్ర..

సారాంశం

ఉత్తరాంధ్ర జలం కోసం – జల పోరు పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసంపూర్ణంగా నిలిచిపోయిన తాగు సాగు నీటి ప్రాజెకులపై బీజేపీ పోరుబాటను ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఈ యాత్ర సాగుతుంది. 

ఉత్తరాంధ్ర జలం కోసం – జల పోరు పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసంపూర్ణంగా నిలిచిపోయిన తాగు సాగు నీటి ప్రాజెకులపై బీజేపీ పోరుబాటను ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఈ యాత్ర సాగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 7, 8, 9 తేదీలలో ఈ యాత్రను చేపట్టనున్నారు. ఈ యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ప్రారంభించనున్నారు. కుటుంబ పార్టీల వల్లే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాజెక్టులు ఆగిపోయాయని బీజేపీ ఆరోపిస్తుంది.  ఉత్తరాంధ్రలో అసంపూర్తిగా నిలిచిపోయిన తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై పోరుబాటలో భాగంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ తెలిపింది. 

ఇక, నేడు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సోము వీర్రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ మరింతగా పుంజుకుంటుందని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చే వరకూ బీజేపీ యువ మోర్చా ఆందోళన  చేస్తుందన్నారు. ఈ నెల 4న గుంటూరులో జ‌ర‌గ‌నున్న పార్టీ స‌మావేశంలో ఈ నిర‌స‌న‌లకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తులకు ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే తాను అక్కడ పర్యటిస్తామని వెల్లడించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జగన్ మత మార్పిడులపై Vijaysai Reddy Sensational Comments | Asianet Telugu
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu