ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కూడా యాక్టీవ్ అవుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కేడర్ కూడా స్పీడ్ పెంచుతోంది. దీనిలో భాగంగా పార్టీని మరింత బలపరచాలనే ఉద్దేశంతో శనివారం 26 జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించారు సోము వీర్రాజు.