తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,89, 681కి చేరిక

By narsimha lodeFirst Published Feb 26, 2021, 4:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 681 కి చేరుకొన్నాయి. 


 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 681 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు   మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,169 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,38,77,968 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 34,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో096 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 071 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 81వేల 877 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 635 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 006, చిత్తూరులో 022,తూర్పుగోదావరిలో 007, గుంటూరులో 017, కడపలో 006, కృష్ణాలో 009, కర్నూల్ లో 003, నెల్లూరులో 009, ప్రకాశంలో 000, శ్రీకాకుళంలో 004, విశాఖపట్టణంలో 005, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 004 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,746, మరణాలు 599
చిత్తూరు  -87,408,మరణాలు 849
తూర్పుగోదావరి -1,24,433, మరణాలు 636
గుంటూరు  -75,703, మరణాలు 671
కడప  -55,358, మరణాలు 463
కృష్ణా  -48,900,మరణాలు 681
కర్నూల్  -60,873, మరణాలు 489
నెల్లూరు -62,466, మరణాలు 507
ప్రకాశం -62,201, మరణాలు 580
శ్రీకాకుళం -46,202 మరణాలు 347
విశాఖపట్టణం  -60,008 మరణాలు 567
విజయనగరం  -41,163, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,325, మరణాలు 542
 

click me!