చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం 20,47,459కి చేరిక

By narsimha lodeFirst Published Sep 27, 2021, 5:22 PM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 618 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,47,459కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 06 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,142 కి చేరింది. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో కరోనా (corona cases) కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో38,069 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 618 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,47,459కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 06 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,142 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1178 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 20వేల 835 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 12,482 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,81,32,713 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో008,చిత్తూరులో 122, తూర్పుగోదావరిలో088,గుంటూరులో0978,కడపలో 061, కృష్ణాలో029, కర్నూల్ లో002, నెల్లూరులో100, ప్రకాశంలో 076,విశాఖపట్టణంలో 038,శ్రీకాకుళంలో008, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 007 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో  06 మంది చనిపోయారు.కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,142కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,571, మరణాలు 1092
చిత్తూరు-2,43,408, మరణాలు1903
తూర్పుగోదావరి-2,90,788, మరణాలు 1278
గుంటూరు -1,75,675,మరణాలు 1206
కడప -1,14,884, మరణాలు 637
కృష్ణా -1,17,202,మరణాలు 1375
కర్నూల్ - 1,24,012,మరణాలు 851
నెల్లూరు -1,44,669,మరణాలు 1036
ప్రకాశం -1,36,955, మరణాలు 1090
శ్రీకాకుళం-1,22,672, మరణాలు 783
విశాఖపట్టణం -1,56,517, మరణాలు 1119
విజయనగరం -82,748, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,77,463, మరణాలు 1103

: 27/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,44,564 పాజిటివ్ కేసు లకు గాను
*20,17,940 మంది డిశ్చార్జ్ కాగా
*14,142 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,482 pic.twitter.com/USdmoZ4ej3

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!