ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 20,53,192కి చేరిక

By narsimha lodeFirst Published Oct 4, 2021, 6:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.గత 24 గంటల్లో 429 కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనా కేసులు 20,53,192కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 04 మంది మృత్యువాతపడ్డారు.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో కరోనా (corona cases) కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో30,515 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 429 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,53,192కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 04 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,208 కి చేరింది. 

also read:ఏపీ : 24 గంటల్లో 765 మందికి పాజిటివ్... 20,49,868కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

గడిచిన 24 గంటల్లో 1029 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 29వేల 231 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 9,753 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,84,76,467 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో001,చిత్తూరులో 072, తూర్పుగోదావరిలో089,గుంటూరులో040,కడపలో 006, కృష్ణాలో039, కర్నూల్ లో003 నెల్లూరులో085, ప్రకాశంలో 043,విశాఖపట్టణంలో 034,శ్రీకాకుళంలో008, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 007 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో నలుగురు చనిపోయారు.గుంటూరు  జిల్లాల్లో ఇద్దరు,చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో  ఒక్కొక్కరి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,209కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,620, మరణాలు 1092
చిత్తూరు-2,44,480, మరణాలు1922
తూర్పుగోదావరి-2,91,827, మరణాలు 1283
గుంటూరు -1,76,301,మరణాలు 1219
కడప -1,15,106, మరణాలు 639
కృష్ణా -1,17,713,మరణాలు 1357
కర్నూల్ - 1,24,028,మరణాలు 852
నెల్లూరు -1,45,316,మరణాలు 1041
ప్రకాశం -1,37,577, మరణాలు 1097
శ్రీకాకుళం-1,22,746, మరణాలు 784
విశాఖపట్టణం -1,56,777, మరణాలు 1120
విజయనగరం -82,788, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,78,018, మరణాలు 1103

: 04/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,50,297 పాజిటివ్ కేసు లకు గాను
*20,26,336 మంది డిశ్చార్జ్ కాగా
*14,208 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,753 pic.twitter.com/HBloJH7W3O

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!