తూ.గోదావరిలో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,68,487కి చేరిక

By narsimha lodeFirst Published Nov 8, 2021, 7:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో28,855 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 246 మందికి కరోనా నిర్ధారణ అయింది.

అమరావతి:Andhra pradesh రాష్ట్రంలో కరోనా Corona cases కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో28,855 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 246 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,68,487కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజున కరోనా బారిన పడి  నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,401 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 334 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 50వేల 720 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 3366 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,97,74,392 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో000,చిత్తూరులో 041, తూర్పుగోదావరిలో080,గుంటూరులో031,కడపలో 013, కృష్ణాలో013, కర్నూల్ లో001, నెల్లూరులో011, ప్రకాశంలో 010,విశాఖపట్టణంలో 029,శ్రీకాకుళంలో014, విజయనగరంలో 001,పశ్చిమగోదావరిలో 002కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు.కృష్ణా, గుంటూరు, కర్నూల్, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,401కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,873, మరణాలు 1093
చిత్తూరు-2,47,293, మరణాలు1949
తూర్పుగోదావరి-2,94,175, మరణాలు 1290
గుంటూరు -1,78,311,మరణాలు 1245
కడప -1,15,710, మరణాలు 644
కృష్ణా -1,19,599,మరణాలు 1438
కర్నూల్ - 1,24,155,మరణాలు 854
నెల్లూరు -1,46,534,మరణాలు 1053
ప్రకాశం -1,38,565, మరణాలు 1127
శ్రీకాకుళం-1,23,228, మరణాలు 786
విశాఖపట్టణం -1,57,952, మరణాలు 1130
విజయనగరం -82,986, మరణాలు 672
పశ్చిమగోదావరి-1,79,211, మరణాలు 1120

: 08/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,65,592 పాజిటివ్ కేసు లకు గాను
*20,47,825 మంది డిశ్చార్జ్ కాగా
*14,401 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,366 pic.twitter.com/sfxUsiN3a4

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!