ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,87,010కి చేరిక

Published : Jan 25, 2021, 07:19 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,87,010కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 87వేల 010 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 87వేల 010 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  కూడా మరణించారు.  రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,147కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,76,113 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 44,382 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో158 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 156 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 78వేల 387 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1476 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 010, చిత్తూరులో 016,తూర్పుగోదావరిలో 014, గుంటూరులో 015, కడపలో 004, కృష్ణాలో 020, కర్నూల్ లో 006, నెల్లూరులో 008, ప్రకాశంలో 009, శ్రీకాకుళంలో 008, విశాఖపట్టణంలో 022, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 024 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,614, మరణాలు 598
చిత్తూరు  -86,944,మరణాలు 846
తూర్పుగోదావరి -1,24,176, మరణాలు 636
గుంటూరు  -75,398, మరణాలు 670
కడప  -55,216, మరణాలు 462
కృష్ణా  -48,490,మరణాలు 676
కర్నూల్  -60,776, మరణాలు 488
నెల్లూరు -62,289, మరణాలు 506
ప్రకాశం -62,159, మరణాలు 580
శ్రీకాకుళం -46,099, మరణాలు 347
విశాఖపట్టణం  -59,642, మరణాలు 561
విజయనగరం  -41,126, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,184, మరణాలు 539

 

 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu