ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు:మొత్తం 8,88,004 చేరిక

Published : Feb 02, 2021, 08:01 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు:మొత్తం 8,88,004 చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 104 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 004 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 104 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 88వేల 004 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనాతో ఒక్కొక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,156కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,89,103 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 29,309 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో104 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 147మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 79వేల 651 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1197 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 003, చిత్తూరులో 017,తూర్పుగోదావరిలో 006, గుంటూరులో 008, కడపలో 004, కృష్ణాలో 025, కర్నూల్ లో 003, నెల్లూరులో 002, ప్రకాశంలో 000, శ్రీకాకుళంలో 002, విశాఖపట్టణంలో 027, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,651, మరణాలు 598
చిత్తూరు  -87056,మరణాలు 847
తూర్పుగోదావరి -1,24,281, మరణాలు 636
గుంటూరు  -75,519 మరణాలు 671
కడప  -55,272, మరణాలు 463
కృష్ణా  -48,695,మరణాలు 678
కర్నూల్  -60,821, మరణాలు 488
నెల్లూరు -62,335, మరణాలు 506
ప్రకాశం -62,175, మరణాలు 580
శ్రీకాకుళం -46,128, మరణాలు 347
విశాఖపట్టణం  -59,800, మరణాలు 561
విజయనగరం  -41,135, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,241, మరణాలు 542

 


 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami