ప్రభుత్వ జీవోలన్నీ ఈ గెజిట్‌లో: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Published : Sep 08, 2021, 12:35 PM IST
ప్రభుత్వ జీవోలన్నీ ఈ గెజిట్‌లో: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్ ద్వారా ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. జీవోఐఆర్ వెబ్‌సైట్ ను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించాయి. 

అమరావతి:  ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ గెజిట్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు జీవోఐఆర్ వెబ్‌సైట్ ను నిలిపివేసింది ఏపీ సర్కార్. ఈ విషయమై టీడీపీ సహ విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. గవర్నర్ కు  టీడీపీ ఫిర్యాదు చేసింది.

సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం  ఈ గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు.అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, ఆదాయం, సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను ఇందులో పొందుపర్చబోమని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Nadendla Manohar Pressmeet: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై మంత్రి కీలక ప్రకటన | Asianet News Telugu
No Shortage of LPG Cylinders: గ్యాస్ బుకింగ్‌లో కొత్త రూల్స్ | Asianet News Telugu