
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా (east godavari district) మండపేటలోని బాణసంచా కేంద్రంలో పేలుడు (explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.