జంగారెడ్డి గూడెం మిస్టరీ మరణాలపై చర్చకు టీడీపీ పట్టు: ఏపీ అసెంబ్లీ వాయిదా

Published : Mar 14, 2022, 09:31 AM ISTUpdated : Mar 14, 2022, 09:39 AM IST
జంగారెడ్డి గూడెం మిస్టరీ మరణాలపై చర్చకు టీడీపీ పట్టు: ఏపీ అసెంబ్లీ వాయిదా

సారాంశం

శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు వాయిదా పడింది. జంగారెడ్డి గూడెంలో మిస్టరీ మరణాలపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో శాసనసభను వాయిదా వేశారు.

అమరావతి: Andhra Pradesh Assembly సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమైన కొద్ది సేపటికి వాయిదా పడ్డాయి. Jangareddy Gudemలో మిస్టరీ మరణాలపై చర్చకు TDP సభ్యులు పట్టుబడడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో శాసనసభను స్పీకర్ Tammineni Sitaram వాయిదా వేశారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో West Godavari జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై టీడీపీ సభ్యులు  వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. ఈ విషయమై ఏపీ శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొంది.  టీడీపీ సభ్యులు  సభలో నిలబడి నినాదాలు చేశారు. చర్చకు పట్టుబడ్డారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్దేశ్య పూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని  ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి Buggana Rajenath Reddy చెప్పారు. ప్రతి రోజూ సభలో  టీడీపీ సభ్యులు నానా యాగీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ తమ స్థానాల నుండి ముందుకు రావడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరును తప్పు బట్టారు. టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండడంతో స్పీకర్  తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు.ఇటీవల కాలంలో  జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల‌నే చనిపోయార‌నే ప్రచారం కూడా లేకపోలేదు. 

ఈ మరణాలపై  ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్  జంగారెడ్డి గూడెనికి  చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి  వివ‌రాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పారు. ఇందులో ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఉన్నర‌ని పేర్కొన్నారు. అయితే మృతుల కుటుంబీకులు మాత్రం త‌మవారు క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్లనే చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు  స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గురువారం ఒక‌రు హాస్పిట్  ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu