రాజధాని కేసులు:ముకుల్ రోహత్గీకి అప్పగించిన జగన్ సర్కార్

Published : Jan 23, 2020, 12:42 PM IST
రాజధాని కేసులు:ముకుల్ రోహత్గీకి అప్పగించిన జగన్ సర్కార్

సారాంశం

రాజధాని విషయంలో దాఖలైన కేసులను వాదించేందుకు గాను ముకుల్ రోహత్గీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఈ కేసులను వాదించేందుకు దేశంలోనే పేరొందిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని  ప్రభుత్వం నియమించుకొంది.

Also read:సీఐడీ కేసు:796 తెల్ల రేషన్ కార్డుదారులకు అమరావతిలో భూములు

రోహిత్గీకి ఫీజు కింద రూ. 5 కోట్లు కేటాయిస్తూ ఏపీ  ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీజులో భాగంగా అడ్వాన్స్‌గా కోటి రూపాయాలను  రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు కూడ  అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడురాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్  ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించింది.  శాసనససభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. శాసనమండలి ఈ బిల్లులను  సెలెక్ట్ కమిటీకి పంపింది.  

ఇదిలా ఉంటే  సీఆర్‌డీఏ రద్దు , పాలనా వికేంద్రీకరణ బిల్లులపై ఉన్నత న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం ప్రభుత్వం తరపున వాదనలను విన్పించేందుకు  రోహత్గీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకొంది. రాష్ట్ర రాజధానిపై ఏర్పాటు చేసిన కేసులను వాదించేందుకు  రోహిత్గీని నియమించుకొంది ప్రభుత్వం.
 

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli