ప.గో. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికుల ఆందోళన

Published : Apr 14, 2022, 09:34 AM IST
ప.గో. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికుల ఆందోళన

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో గల ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలోఆరుగురు మృతి చెందిన ఘటనతో స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు.  

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని  ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడంలోని Fores chemical Factory  కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో Six మృతి చెందారు. ఈ ఘటనను నిరసిస్తూ Factory ఎదుట గురువారం నాడు ఉదయం  స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఈ ఫ్యాక్టరీలో ఇదే తరహలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి  చర్యలు తీసుకోని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

ఈ ఫ్యాక్టరీలోని నాలుగవ యూనిట్ లో Gas leak రియాక్టర్ పేలిందని  ప్రాథమికంగా గుర్తించారు. ఘటన స్థలంలోనే ఐదుగురు మరణించారు.  ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 13 మంది కార్మికులున్నారు. ఈ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తొలుత నూజివీడు ఆసుపత్రికి అక్కడి నుండి Vijayawada జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందికి 80 శాతం పైగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితుల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.

ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు,  గాయపడిన వారికి రూ. 2 లక్షలను ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!