పెళ్లి తర్వాత తొలిసారిగా అఖిలప్రియ దంపతులు..ఏంచేశారంటే

Published : Sep 12, 2018, 12:39 PM ISTUpdated : Sep 19, 2018, 09:23 AM IST
పెళ్లి తర్వాత తొలిసారిగా అఖిలప్రియ దంపతులు..ఏంచేశారంటే

సారాంశం

మంత్రి అఖిలప్రియ వివాహం ఇటీవల భార్గవ్ తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు తొలిసారిగా కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ఏపీ పర్యాటశాఖ మంత్రి అఖిలప్రియ వివాహం ఇటీవల భార్గవ్ తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు తొలిసారిగా కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

మంత్రి అఖిలప్రియ దంపతులు వరినాట్లు వేశారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలోని పాములేటి అనే రైతు పొలంలో మంత్రి, ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడు వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా కూలీలతో వారు మాటామంతీ కలిపి వ్యవసాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు ఎంత కూలీ ఇస్తున్నారు? అని ఆరా తీశారు. కొత్త దంపతులు ఇలా తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

సామాన్యుడి లా వెళ్లి డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్| Asianet News Telugu
రాజనగరంలోని అటవీ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్| Asianet News Telugu