వైసీపీలోకి అక్కినేని నాగార్జున: వైఎస్ జగన్ తో భేటీ

Published : Feb 19, 2019, 04:12 PM IST
వైసీపీలోకి అక్కినేని నాగార్జున: వైఎస్ జగన్ తో భేటీ

సారాంశం

నాగార్జునకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.   

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో అక్కినేని నాగార్జున జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

నాగార్జునకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 

అంతేకాకుండా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ను అక్కినేని నాగార్జున కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే సోమవారం జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కలిశారు. తాజాగా నాగార్జున కలవడం రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu