జగన్ కాన్వాయ్ కు అడ్డుపడిన మహిళ

Published : May 29, 2019, 11:55 AM IST
జగన్ కాన్వాయ్ కు అడ్డుపడిన మహిళ

సారాంశం

జగన్ కాన్వాయ్ కు ఆ మహిళ అడ్డుపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకుంటుండగా వైయస్ జగన్ గమనించారు. ఆ మహిళను తన వద్దుకు పిలిపించుకున్నారు వైయస్ జగన్. ఆమెతో మాట్లాడారు. 

తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం బయలు దేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయన్ కు ఓ మహిళ అడ్డుపడింది. 

జగన్ కాన్వాయ్ కు ఆ మహిళ అడ్డుపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకుంటుండగా వైయస్ జగన్ గమనించారు. ఆ మహిళను తన వద్దుకు పిలిపించుకున్నారు వైయస్ జగన్. ఆమెతో మాట్లాడారు. 

కాన్వాయ్ కు అడ్డుపడాల్సిన అంశంపై ప్రశ్నించారు. తన భర్తకు ఉద్యోగం కావాలని ఆ మహిళ జగన్ కు విజ్ఞప్తి చేసింది. తనకుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని తన భర్తకు ఉపాధి కల్పిస్తే బతుకుతామంటూ జగన్ కు మెురపెట్టుకుంది. జగన్ ఆమెకు భరోసా ఇవ్వడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది.

PREV
click me!

Recommended Stories

మాట్లాడుతూనే ఉంటా.. దేనికైనా రెడీ! | Professor Nageshwar Strong Reaction | Asianet News Telugu
చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ తెలుగు తమ్ముళ్లకు పూనకాలే | Mahanadu2026 | Asianet News Telugu