ఏపీలో పడిపోతున్న కరోనా కేసులు: కొత్తగా 8,766 మందికి పాజిటివ్.. చిత్తూరులో భయపెడుతున్న మరణాలు

Siva Kodati |  
Published : Jun 09, 2021, 06:54 PM IST
ఏపీలో పడిపోతున్న కరోనా కేసులు: కొత్తగా 8,766 మందికి పాజిటివ్.. చిత్తూరులో భయపెడుతున్న మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తగ్గుదల నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,766 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,79,773కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తగ్గుదల నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,766 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,79,773కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,696కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 7, అనంతపురం 5, తూర్పుగోదావరి 7, చిత్తూరు 11, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 2, కృష్ణ 4, విశాఖపట్నం 7, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 4, ప్రకాశం 3, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 12,292 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,64,082కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 93,511 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,00,39,764కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,03,995 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 960, చిత్తూరు 974, తూర్పుగోదావరి 1980, గుంటూరు 520, కడప 582, కృష్ణ 339, కర్నూలు 338, నెల్లూరు 391, ప్రకాశం 711, శ్రీకాకుళం 277, విశాఖపట్నం 592, విజయనగరం 265, పశ్చిమ గోదావరిలలో 837 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్