ఏపీ : 24 గంటల్లో 765 మందికి పాజిటివ్... 20,49,868కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Oct 03, 2021, 05:31 PM IST
ఏపీ : 24 గంటల్లో 765 మందికి పాజిటివ్... 20,49,868కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 765 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 973 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 10,357 మంది చికిత్స పొందుతున్నారు  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు మరోసారి 1000లోపే నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,49,868కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,204కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరు 2, కృష్ణ 2, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూల్, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 973 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,25,307కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 45,481 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,84,45,952కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 10,357 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 1, చిత్తూరు 161, తూర్పుగోదావరి 94, గుంటూరు 91, కడప 47, కృష్ణ 70, కర్నూలు 3, నెల్లూరు 91, ప్రకాశం 72, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 22, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 90 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu