ఏపీలో కరోనా ఉగ్రరూపం: కొత్తగా 60 పాజిటివ్ కేసులు, 1777కు చేరిన సంఖ్య

By telugu teamFirst Published May 6, 2020, 11:24 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 36కు చేరుకుంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,782 శాంపిల్స్ ను పరీక్షించగా 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1777కు చేరుకుంది. 

వారిలో 769 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 36 మంది మరణించారు. ప్రస్తుతం 1012 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదు. కొత్తగా గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా 533 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లా 363 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 14 కేసులు నమోదుయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 300 మార్కుకు చేరుకుంది. 

గత 24 గంటల్లో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కడప జిల్లాలో 1 కేసు నమోదైంది. విజయనగరం జిల్లా ఇంకా కరోనా ఫ్రీగానే కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 27 మంది కరోనా పాజిటివ్ బారిన బడ్డారు. ఇందులో 12 పాజిటివ్ కేసులు గుజరాత్ కు సంబంధించినవి.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. కృష్ణా జిల్లలో 10 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో 4గురు మరణించారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 80
చిత్తూరు 82
తూర్పు గోదావరి 46
గుంటూరు 363
కడప  90
కృష్ణా 300
కర్నూలు 533
నెల్లూరు 92
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 39
పశ్చిమ గోదావరి 59

 

రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,782 సాంపిల్స్ ని పరీక్షించగా 60 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1777 పాజిటివ్ కేసు లకు గాను 729 మంది డిశ్చార్జ్ కాగా, 36 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1012. pic.twitter.com/gkHBvs6lRo

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!