కర్నూలు: అతిసార పంజా.. నలుగురి మృతి, గ్రామం విడిచిపోతున్న జనం

Siva Kodati |  
Published : Apr 07, 2021, 02:29 PM IST
కర్నూలు: అతిసార పంజా.. నలుగురి మృతి, గ్రామం విడిచిపోతున్న జనం

సారాంశం

కర్నూలు జిల్లా గోరుకల్లు గ్రామానికి అతిసార భయం పట్టుకుంది. కలుషిత నీరు తాగి నలుగురు మృతిచెందిన ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు గ్రామస్తులు. ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు

కర్నూలు జిల్లా గోరుకల్లు గ్రామానికి అతిసార భయం పట్టుకుంది. కలుషిత నీరు తాగి నలుగురు మృతిచెందిన ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు గ్రామస్తులు. ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు.

తమ సొంత గ్రామం వదిలి బంధువుల ఊరు వెళ్లి గోరుకల్లు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోరుకల్లు, ఆదోని పరిసర ప్రాంతాల్లో అతిసార బారినపడి సుమారు 100 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

లక్షణాలు కనిపించిన వారంతా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పోటెత్తుతున్నారు. అయితే నిన్న ఒకేరోజు ఇద్దరు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమై గ్రామానికి చేరుకున్నారు.

ఈ గ్రామానికి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటి సరఫరాలో లీకేజ్ కారణంగానే అతిసార ప్రబలినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu