ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకేసారి 334 మందికి కరోనా, విశాఖలో అత్యధికం

By Siva KodatiFirst Published Jan 4, 2022, 7:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 334 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,75,047కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 334 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,75,047కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల ఎవరూ నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,499కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 95 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,59,032కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 28,311 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,14,25,946కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1516 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 29, చిత్తూరు 55, తూర్పుగోదావరి 17, గుంటూరు 39, కడప 4, కృష్ణ 50, కర్నూలు 7, నెల్లూరు 14, ప్రకాశం 4, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 80, విజయనగరం 4, పశ్చిమ గోదావరిలలో 16 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 
 

: 04/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,75,047 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,032 మంది డిశ్చార్జ్ కాగా
*14,499 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,516 pic.twitter.com/AwSCaxIto3

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!