వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తల మృతి

Siva Kodati |  
Published : Nov 07, 2020, 05:56 PM IST
వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తల మృతి

సారాంశం

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరిని వెల్దుర్తికి చెందిన రాము, దేవేంద్రగా గుర్తించారు.

ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలవ్వడంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు  తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Twin Towers: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత నిర్మాణం.. 47 అంత‌స్తుల ట్విన్ ట‌వ‌ర్స్‌. ఎక్క‌డంటే.?
Andhra pradesh: ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఆగ‌స్టు 7న‌ ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయం