వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తల మృతి

Siva Kodati |  
Published : Nov 07, 2020, 05:56 PM IST
వైసీపీ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తల మృతి

సారాంశం

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరిని వెల్దుర్తికి చెందిన రాము, దేవేంద్రగా గుర్తించారు.

ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలవ్వడంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు  తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

కడప జిల్లా ఉన్నత పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పిన లోకేష్| Nara Lokesh Visit Proddatur ZP High School
భీమవరం బహిరంగ సభకు సినిమా రేంజ్ లో జగన్ ఎంట్రీ | YS Jagan Bhimavaram Tour