తుంగభద్ర ఎగువ కాలువపై కుప్పకూలిన వంతెన: మహిళ గల్లంతు, 29 మందిని రక్షించిన స్థానికులు

Published : Jan 17, 2022, 07:15 PM IST
తుంగభద్ర ఎగువ కాలువపై కుప్పకూలిన వంతెన: మహిళ గల్లంతు, 29 మందిని రక్షించిన స్థానికులు

సారాంశం

అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువపై ఉన్న పురాతన బ్రిడ్జి  కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. మరో 29 మందిని రక్షించారు.

అనంతపురం: Anantapur జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువపై ఉన్న పురాతన Bridge కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు కాగా, మరో 29 మందిని స్థానికులు రక్షించారు.గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతపురం జిల్లా Bommanahalli మండలం ఉద్దేహల్ సమీపంలో Tungabhadra  నదిపై వంతెన కుప్పకూలింది. అదే సమయంలో వంతెనపై Auto వెళ్తుంది.ఆటో వెళ్తున్న సమయంలోనే వంతెన కూలింది. దీంతో ఆటో నదిలో పడిపోయింది.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆటోలో ఉన్న ప్రయాణీకులు ఎగువ కాలువలో కొట్టుకుపోతుండగా రక్షించారు. ఆటో నుండి 29 మందిని రక్షించారు. ఈ ఘటనలో సావిత్రి అనే మహిళ గల్లంతైంది.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu