ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 264 మందికి పాజిటివ్.. కృష్ణా జిల్లాలో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 24, 2021, 06:44 PM IST
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు:  24 గంటల్లో 264 మందికి పాజిటివ్.. కృష్ణా జిల్లాలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 247 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,175 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి (corona cases in ap). గడిచిన 24 గంటల్లో 264 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,68,936కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,430కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 247 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,52,331కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,987 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,02,55,667కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,175 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 13, చిత్తూరు 30, తూర్పుగోదావరి 46, గుంటూరు 36, కడప 8, కృష్ణ 45, కర్నూలు 3, నెల్లూరు 19, ప్రకాశం 8, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 19, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 20 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్