ఏపీ: 24 గంటల్లో కొత్తగా 2,498 కరోనా కేసులు.. గోదావరి జిల్లాల్లో తీవ్రత

Siva Kodati |  
Published : Jul 20, 2021, 06:20 PM IST
ఏపీ: 24 గంటల్లో కొత్తగా 2,498 కరోనా కేసులు.. గోదావరి జిల్లాల్లో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 2,498 కరోనా కేసులు నమోదవ్వగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,201మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 23,843 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,498 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,44,222కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,178కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 5, ప్రకాశం 4,  అనంతపురం 2 , కృష్ణ 1, కర్నూలు 1, నెల్లూరు 3, పశ్చిమ గోదావరి 3, గుంటూరు 2, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,201 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,04,306కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 88,149 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,37,52,356కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 23,843 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 73, చిత్తూరు 245, తూర్పుగోదావరి 481, గుంటూరు 181, కడప 68, కృష్ణ 263, కర్నూలు 24, నెల్లూరు 233, ప్రకాశం 336, శ్రీకాకుళం 56, విశాఖపట్నం 179, విజయనగరం 33, పశ్చిమ గోదావరిలలో 326 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.   


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు