స్కూటీపై నుంచి జారీ పడ్డ చిన్నారి.. బిడ్డ కోసం దూకేసిన తల్లి, దూసుకొచ్చిన లారీ

Siva Kodati |  
Published : Sep 23, 2022, 05:37 PM IST
స్కూటీపై నుంచి జారీ పడ్డ చిన్నారి.. బిడ్డ కోసం దూకేసిన తల్లి, దూసుకొచ్చిన లారీ

సారాంశం

పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. తేజ స్కూటీ నుంచి జారీ కిందపడ్డాడు. బిడ్డ కోసం తల్లి యశోద కూడా స్కూటీ పైనుంచి దూకేసింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో బాలుడు తేజ అక్కడికక్కడే మృతిచెందాడు

పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల నుంచి దామరచర్ల నుంచి వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులతో కలిసి స్కూటీపై వెళ్తున్నారు. అయితే రెండేళ్ల చిన్నారి తేజ స్కూటీ నుంచి జారీ కిందపడ్డాడు. బిడ్డ కోసం తల్లి యశోద కూడా స్కూటీ పైనుంచి దూకేసింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో బాలుడు తేజ అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి యశోదకు తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli