ఏపీలో పడిపోయిన కరోనా మరణాలు: కొత్తగా 1859 మందికి పాజిటివ్, 19,586,015కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Aug 12, 2021, 06:26 PM IST
ఏపీలో పడిపోయిన కరోనా మరణాలు: కొత్తగా 1859 మందికి పాజిటివ్, 19,586,015కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 1859 కరోనా కేసులు నమోదవ్వగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1575 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,688 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1859 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,586,015కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,595కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, కృష్ణ 3, ప్రకాశం 2, నెల్లూరు 1, విశాఖ పట్నం ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1575 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,53,732కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 70,757 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,54,53,520కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,688 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 40, చిత్తూరు 233, తూర్పుగోదావరి 402, గుంటూరు 182, కడప 148, కృష్ణ 144, కర్నూలు 19, నెల్లూరు 225, ప్రకాశం 96, శ్రీకాకుళం 28, విశాఖపట్నం 123, విజయనగరం 24, పశ్చిమ గోదావరిలలో 195 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu