ఏపీలో కొత్తగా 176 మందికి కరోనా పాజిటివ్.. విశాఖలో తగ్గని జోరు

Siva Kodati |  
Published : Jan 01, 2022, 07:47 PM IST
ఏపీలో కొత్తగా 176 మందికి కరోనా పాజిటివ్.. విశాఖలో తగ్గని జోరు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,74,426కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,74,426కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,495కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 103 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,58,704కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 30,717 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,13,57,848కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1227 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 18, చిత్తూరు 29, తూర్పుగోదావరి 7, గుంటూరు 21, కడప 1, కృష్ణ 26, కర్నూలు 5, నెల్లూరు 9, ప్రకాశం 3, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 40, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 7 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

కాగా.. గ‌త 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.10లక్షల మందికి క‌రోనా వైర‌స్  వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో  22,775 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వ‌చ్చింది. పాజిటివిటీ రేటు సైతం 2శాతం దాటడం గమనార్హం. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ నుంచి 8949 మంది బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో వైర‌స్ నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3.42కోట్ల కు చేరుకుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సంభ‌విస్తున్న మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. 

నిన్న ఒక్క రోజే 406 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటివరకు 4.81లక్షల మందిని కోవిడ్‌-19బలితీసుకుంది. మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ లక్షకు పైగా పెరిగాయి. దీంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. దేశంలో ప్ర‌స్తుతం 1,04,781 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా కూడా వివిధ ఆస్పత్రులు, హోఐసోలేష‌న్, కోవిడ్‌-19 కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నారు. భార‌త్ లో క్రియాశీల రేటు రేటు 0.30శాతానికి పెరిగింది.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?