వాటర్‌ ట్యాంకులో శవమై తేలిన 15 నెలల చిన్నారి.. అమ్మమ్మపైనే అనుమానం

Siva Kodati |  
Published : Jul 09, 2021, 03:14 PM IST
వాటర్‌ ట్యాంకులో శవమై తేలిన 15 నెలల చిన్నారి.. అమ్మమ్మపైనే అనుమానం

సారాంశం

నెల్లూరు రూరల్ మండలంలో వాటర్ ట్యాంకులో 15 నెలల పసిపాప శవమై తేలడం సంచలనం సృష్టించింది. ఆమె అమ్మమ్మపైనే తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

నెల్లూరు రూరల్‌లో దారుణం జరిగింది. స్థానిక రంగనాయకుల పేట గొల్లవీధిలో 15 నెలల ఆడ శిశువును వాటర్ ట్యాంకులో పడేసి హత్య చేశారు దుండగులు. వాటర్ ట్యాంక్‌లో పాప మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారికి వరుసకు అమ్మమ్మ అయ్యే మహిళపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu