ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నాడు ఉదయం లారీ, బస్సును ఢీకొన్న ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో టూరిస్టు బస్సు పూర్తిగా దగ్ధమైంది.
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వరిశాం జంక్షన్ వద్ద అమోనియం లారీని టూరిస్ట్ బస్సు ఢీకొంది.దీంతో టూరిస్టు బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయణీకులు ఉన్నారు.