ఏపీ: కొత్తగా 1321 మందికి పాజిటివ్.. 20,07,671కి చేరిన కేసుల సంఖ్య, చిత్తూరు, తూ.గోలో తీవ్రత

Siva Kodati |  
Published : Aug 28, 2021, 06:47 PM IST
ఏపీ: కొత్తగా 1321 మందికి పాజిటివ్.. 20,07,671కి చేరిన కేసుల సంఖ్య, చిత్తూరు, తూ.గోలో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1321 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,499 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,807 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1321 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,07,671కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,807కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 5, తూర్పుగోదావరి 1, గుంటూరు 1, కర్నూలు 1, కృష్ణ 4, నెల్లూరు 3, ప్రకాశం 3, శ్రీకాకుళంలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,499 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,79,011కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 64,461మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,64,71,272కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,853మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 12, చిత్తూరు 225, తూర్పుగోదావరి 218, గుంటూరు 128, కడప 67, కృష్ణ 153, కర్నూలు 16, నెల్లూరు 139, ప్రకాశం 118, శ్రీకాకుళం 30, విశాఖపట్నం 42, విజయనగరం 31, పశ్చిమ గోదావరిలలో 142 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu