విషాదం: ట్రాన్స్ ఫార్మర్ల మధ్య బంతి.. తీస్తూ కాలిపోయిన చిన్నారి

Siva Kodati |  
Published : Dec 25, 2020, 08:54 PM ISTUpdated : Dec 25, 2020, 09:01 PM IST
విషాదం: ట్రాన్స్ ఫార్మర్ల మధ్య బంతి.. తీస్తూ కాలిపోయిన చిన్నారి

సారాంశం

కడప జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఓ బాలుడు మరణించాడు. పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సొహైల్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.

కడప జిల్లా మైదుకూరులో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఓ బాలుడు మరణించాడు. పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడు సొహైల్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు.

బంతి ట్రాన్స్‌ఫార్మార్ దగ్గర పడింది. ఈ క్రమంలో బాల్ తీసుకొచ్చేందుకు ట్రాన్స్‌ఫార్మార్ వద్దకు వెళ్లాడు సొహైల్. అయితే బంతి తీస్తుండగా చిన్నారి చేయి కరెంట్ తీగలకు తగిలింది.

దీంతో కరెంట్ షాక్ తగిలి శరీరమంతా కాలిపోయింది. అతని అరుపులు విన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

PREV
click me!

Recommended Stories

Kodali Nani Pressmeet: మీ ఎర్ర బుక్కులకి భయపడేది లేదు: కొడాలి నాని| Asianet News Telugu
Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్