రంగంపేటలో కరోనా కలకలం: అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా

Published : Jul 27, 2020, 07:49 PM ISTUpdated : Jul 27, 2020, 07:51 PM IST
రంగంపేటలో కరోనా కలకలం: అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా

సారాంశం

చిత్తూరు జిల్లాలోని ఎ.రంగంపేటలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా సోకింది. ఈ ఘటనతో గ్రామస్తుల భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.

చిత్తూరు:  చిత్తూరు జిల్లాలోని ఎ.రంగంపేటలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా సోకింది. ఈ ఘటనతో గ్రామస్తుల భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.

also read:ఏపీలో కొనసాగుతున్న కరోనా జోరు: 1,02,349కి చేరిన కేసులు

రంగంపేట గ్రామంలో ఇటీవల కాలంలో ఓ వ్యక్తి మరణించాడు. డెడ్‌బాడీకి కరోనా టెస్టులు నిర్వహించలేదు. అయితే చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలుసుకోకుండా అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే ఈ అంత్యక్రియలు నిర్వహించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది.  అంతేకాదు ఈ గ్రామానికి చెందిన మరో నలుగురు గ్రామస్తులకు కూడ కరోనా సోకింది. గ్రామంలో 11 మందికి ఒకే సారి కరోనా సోకడంతో గ్రామస్థుల్లో భయంతో పరీక్షలకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

మృతదేహాలకు కూడ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కరోనా లక్షణాలు కన్పించకపోవడంతో ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే కొంప ముంచిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రంలో సోమవారం నాటికి లక్ష కరోనా కేసులు దాటాయి. చిత్తూరులో ఇప్పటివరకు 7809 కేసులు రికార్దయ్యాయి. కరోనాతో జిల్లాలో 84  మంది మరణించారు.

PREV
click me!

Recommended Stories

YS Sharmila: కోలుకుంటోన్న వైఎస్ ష‌ర్మిల‌.. ఇంత‌కీ ఆమెకు ఏం జ‌రిగిందంటే.?
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !